మూడు ఇసుక ట్రాక్టర్లు సీజ్
ABN , Publish Date - May 29 , 2024 | 11:00 PM
రాయచోటి పట్టణ పరిధిలోని ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను రాయచోటి ఎస్ఈబీ పోలీసులు సీజ్ చేశారు.
![మూడు ఇసుక ట్రాక్టర్లు సీజ్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
రాయచోటిటౌన్, మే 29: రాయచోటి పట్టణ పరిధిలోని ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను రాయచోటి ఎస్ఈబీ పోలీసులు సీజ్ చేశారు. గత కొద్దిరోజులుగా రాయచోటి మండల పరిధిలోని మాండవ్య నదితో పాటు ఇతర వంకలు, వాగుల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న తరుణంలో బుధవారం ఎస్ఈబీ పోలీసులు రాయచోటి పట్టణంలో ఇసుకను అక్రమంగా తీసుకెళ్తున్న మూడు ట్రాక్టర్లను సీజ్ చేసి రాయచోటి అర్బన్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు అర్బన్ సీఐ సుధాకర్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.