Share News

వాళ్లు న్యాయస్థానానికి వెళ్లొచ్చు

ABN , Publish Date - Feb 28 , 2024 | 03:19 AM

ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై చట్ట ప్రకారమే అనర్హత వేటు వేశానని అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద సీఎం

వాళ్లు న్యాయస్థానానికి వెళ్లొచ్చు

కోటంరెడ్డి వ్యాఖ్యలపై స్పీకర్‌ తమ్మినేని

అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై చట్ట ప్రకారమే అనర్హత వేటు వేశానని అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద సీఎం జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన వైసీపీ నిర్వహించిన సిద్ధం వర్క్‌షా్‌పనకు స్పీకర్‌ తమ్మినేని హాజరయ్యారు. ఈ సందర్భంగా అనర్హత వేటు నిర్ణయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన ప్రకటనపై స్పందిస్తూ... ‘అసెంబ్లీ కూడా న్యాయస్థానమే. నా నిర్ణయంతో విభేదించేవారు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. నేను మాత్రం చట్టపరిధిలోనే వ్యవహరించాను. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశాను’ అని తమ్మినేని స్పష్టం చేశారు.

Updated Date - Feb 28 , 2024 | 08:28 AM