Share News

ఎవరు తీసిన గోతిలో వారే..

ABN , Publish Date - Jun 11 , 2024 | 02:07 AM

‘ఏపీలో వైసీపీ, ఒడిశాలో బీజేడీ పార్టీలను చూస్తుంటే..

ఎవరు తీసిన గోతిలో వారే..

ఏపీలో వైసీపీ, ఒడిశాలో బీజేడీ పార్టీలే ఉదాహరణలు

కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా విభాగం చైర్‌పర్సన్‌ సుప్రియ

న్యూఢిల్లీ, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): ‘‘ఏపీలో వైసీపీ, ఒడిశాలో బీజేడీ పార్టీలను చూస్తుంటే.. ఇతరుల కోసం గొయ్యి తవ్వేవాడు ఏదో ఒకరోజు అదే గుంతలో పడిపోతాడు అని స్పష్టమవుతోంది’’ అని కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా విభాగం చైర్‌పర్సన్‌ సుప్రియా శ్రీనతే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి, బీజేడీ చీఫ్‌ నవీన్‌ పట్నాయక్‌లు మోదీతో కలిసి ఉన్న ఫొటోలను ఆమె ఎక్స్‌లో షేర్‌ చేశారు. ప్రజావ్యతిరేక చట్టాలను రూపొందించడంలో మోదీకి వైసీపీ, బీజేడీ ఎంతగానో మద్దతిచ్చాయన్నారు. గతేడాది మోదీ సర్కారుపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఈ రెండు పార్టీలు వ్యతిరేకించాయని తెలిపారు. ఢిల్లీ సర్వీసెస్‌ బిల్లు, సీఏఏకు మద్దతిచ్చాయని, వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వైసీపీ మద్దతు పలికిందని సుప్రియ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Updated Date - Jun 11 , 2024 | 08:14 AM