టీడీపీకి మెజారిటీ వచ్చిందని వాటర్ ప్లాంట్ మూసేశారు!
ABN , Publish Date - Jun 11 , 2024 | 02:19 AM
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లత్తవరం తండాలో వైసీపీ వర్గీయులు వాటర్ ప్లాంట్కు తాళం వేశారు.
![టీడీపీకి మెజారిటీ వచ్చిందని వాటర్ ప్లాంట్ మూసేశారు!](https://media.andhrajyothy.com/media/2024/20240604/ghl_5b3f07d027.jpg)
వైసీపీ నాయకుల చర్యపై తండా వాసుల ఆవేదన
ఉరవకొండ, జూన్ 10: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లత్తవరం తండాలో వైసీపీ వర్గీయులు వాటర్ ప్లాంట్కు తాళం వేశారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్కు ఈ గ్రామంలో ఆరు ఓట్ల మెజార్టీ వచ్చింది. దీనికితోడు వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి ఓడిపోయారు. దీంతో వైసీపీ నాయకులు అక్కసు తట్టుకోలేక వాటర్ ప్లాంట్ను మూసివేశారు. దీంతో తండావాసులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. జడ్పీ నిధులతో ఈ వాటర్ప్లాంట్ను ఏర్పాటు చేశారు. తాళాలు ఇవ్వాలని అడిగితే సర్పంచ్గా తమ పార్టీ వారే ఉన్నారని, తాళాలు ఇచ్చేది లేదని వైసీపీ వర్గీయులు అంటున్నారని తండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వాటర్ ప్లాంట్ను తెరిపించాలని కోరుతున్నారు.