ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే విజయం
ABN , Publish Date - Apr 08 , 2024 | 11:33 PM
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీ తో విజయం సాధించడం తఽథ్య మని మాజీ సీఎం, రాజంపేట పార్లమెం టు బీజేపీ. జనసేన, టీడీపీ కూట మి ఉమ్మడి బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు.
![ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే విజయం](https://media.andhrajyothy.com/media/2024/20240407/8plr_gkd1_e59f0b0252.gif)
మాజీ సీఎం, రాజంపేట కూటమి ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి
గుర్రంకొండ, ఏప్రిల్ 8:రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీ తో విజయం సాధించడం తఽథ్య మని మాజీ సీఎం, రాజంపేట పార్లమెం టు బీజేపీ. జనసేన, టీడీపీ కూట మి ఉమ్మడి బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. గుర్రంకొండ పట్టణం లోని బజారువీధిలో ఏర్పాటు చేసి న ఇఫ్తార్ విందుకు సోమవారం సాయంత్రం ఆయన హాజర య్యారు. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మాజీ సీఎం కిరణ్కుమా ర్రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ ఆర్థికంగా అభివృద్ది చెందా లంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలన్నారు. వైసీపీ రాక్షస పాలనతో ఐదేళ్లు రాష్ట్రంలో అభివృద్ది పాతాళానికి పడిపోయిందన్నారు. జగన అనే వ్యక్తి సొంత కుటుంబాన్నే నాశ నం చేశాడని అలాంటి వ్యక్తికి మరో అవకాశమిస్తే పేద ప్రజలు బతకడం కష్టమేన న్నారు. పీలేరు నియో జకవర్గంలో వైసీపీ నాయకులు చేసిన అక్రమాలు ఎక్కడా జరగలే దన్నారు. రాజంపేట పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీ గెలిపించడానికి నాయకులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్కుమార్రెడ్డి, మల్లారపు రవిప్రకాశ నాయుడు, నాయకులు ఇంతియాజ్ అహ్మద్, నౌషాద్ అహ్మద్, ఏజాజ్ అహ్మద్, జగదీష్కుమార్, నక్కా సతీష్, నక్కా బాలాజి తదితరులు పాల్గొన్నారు.