Share News

శ్రీవారిని దర్శించుకున్న ఉప రాష్ట్రపతి

ABN , Publish Date - Apr 27 , 2024 | 03:24 AM

తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధనఖడ్‌ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో కుటుంబ సమేతంగా ఆయన ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న ఉప రాష్ట్రపతి

తిరుమల, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధనఖడ్‌ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో కుటుంబ సమేతంగా ఆయన ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, అర్చక బృందం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం జగదీప్‌ ధనఖడ్‌ను రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వదించగా ఈవో ధర్మారెడ్డి టీటీడీ డైరీ, క్యాలెండరు, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఉపరాష్ట్రపతి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్టు తెలిపారు.

Updated Date - Apr 27 , 2024 | 09:13 AM