‘ప్రలోభాల’ పట్టివేత!
ABN , Publish Date - Apr 26 , 2024 | 04:26 AM
రాష్ట్రంలో నామినేషన్ల పర్వం పూర్తయిన నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వారిపై గట్టి నిఘా కొనసాగుతున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు.
రూ.165కోట్ల విలువైన 5228 కిలోల డ్రగ్స్,1473 కిలోల ఆభరణాలు
అమరావతి, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నామినేషన్ల పర్వం పూర్తయిన నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వారిపై గట్టి నిఘా కొనసాగుతున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి గురువారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.165.91 కోట్లకు పైగా విలువైన నగదు, లిక్కర్, డ్రగ్స్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వీటిలో 5,228 కిలోల డ్రగ్స్, 1,473 కిలోల బంగారు, వెండి ఆభరణాలు, 6.62 లక్షల లీటర్ల మద్యం ఉన్నట్టు చెప్పారు. కేవలం గత 24(బుధవారం-గురువారం) గంటల్లో రూ.8.65 కోట్ల విలువైన వస్తులను స్వాధీనం చేసుకున్నామన్నారు.