షర్మిల, సునీతారెడ్డిలపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్టు
ABN , Publish Date - Feb 15 , 2024 | 02:45 AM
ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి వైఎస్ షర్మిలారెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, ఆయన కుమార్తె సునీతారెడ్డిలపై అసభ్యకరమైన పదజాలంతో పోస్టులు పెట్టిన విశాఖకు చెందిన ఉదయ్భూషణ్ అనే వ్యక్తిని అరెస్టు చేశామని కడప జిల్లా ఏఎస్పీ(పరిపాలన) లోసారి సుధాకర్ తెలిపారు.
![షర్మిల, సునీతారెడ్డిలపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్టు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కడప(క్రైం), ఫిబ్రవరి14: ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి వైఎస్ షర్మిలారెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, ఆయన కుమార్తె సునీతారెడ్డిలపై అసభ్యకరమైన పదజాలంతో పోస్టులు పెట్టిన విశాఖకు చెందిన ఉదయ్భూషణ్ అనే వ్యక్తిని అరెస్టు చేశామని కడప జిల్లా ఏఎస్పీ(పరిపాలన) లోసారి సుధాకర్ తెలిపారు. బుధవారం ఆయన నిందితుడి వివరాలను వెల్లడించారు. విశాఖ మహారాణిపేట సామ్రాట్ ఎన్క్లేవ్, నౌరోజీరోడ్డుకు చెందిన ఉదయభూషణ్ రియల్టర్. ఈ ఏడాది జనవరి 13న వి.రవీంద్రరెడ్డి అనే వ్యక్తి పేరిట ఫేస్బుక్ లో ఫేక్ అకౌంటు క్రియేట్ చేసి వి.రవీంద్రరెడ్డి ఫొటోను ప్రొఫైల్ పిక్గా పెట్టి దాని నుంచి షర్మిల, వివేకా, సునీతారెడ్డిలపై అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టాడు. దీనిపై వి.రవీంద్రరెడ్డి స్పందించి తన పేరుతో ఫేక్ ఫేస్బుక్ అకౌం టు ఓపెన్ చేసి ఎవరో పోస్టులు పెడుతున్నారని పులివెందుల అర్బన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు 45/24 క్రైం నంబరు కింద కేసు నమో దు చేశారు. ఫిర్యాదు చేసిన రవీంద్రరెడ్డి వైఎస్సార్ సోషల్ మీడియా మెంబరు గా ఉంటూ పార్టీకి సంబంధించిన మెసేజ్లు పోస్టులు చేస్తుంటాడు. కొన్ని సందర్భాల్లో చంద్రబాబు, లోకేశ్లను విమర్శిస్తూ పోస్టులు పెట్టాడు. వైసీపీ వారితోనే వారిని తిట్టించాలనే ఉద్దేశంతో ఉదయ్భూషణ్ ఫేక్ అకౌంట్లో పోస్టులు పెట్టాడని ఏఎస్పీ తెలిపారు. నిందితుడిని రిమాండుకు తరలించారు.