వీరశైవులకు ప్రభుత్వం చేసింది ఏమీ లేదు
ABN , Publish Date - Apr 08 , 2024 | 12:03 AM
ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న జగన్రెడ్డి ప్రభుత్వం వీరశైవుల కోసం ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదని టీడీపీ వీరశైవ సాధికార కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ శివరాజు, జిల్లా సభ్యుడు కన్నె జగదీష్ అన్నారు.
![వీరశైవులకు ప్రభుత్వం చేసింది ఏమీ లేదు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఆదోని టౌన్, ఏప్రిల్ 7: ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న జగన్రెడ్డి ప్రభుత్వం వీరశైవుల కోసం ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదని టీడీపీ వీరశైవ సాధికార కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ శివరాజు, జిల్లా సభ్యుడు కన్నె జగదీష్ అన్నారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ వీరవైవులకు సంబంధించిన కోట వీరభద్ర స్వామి దేవాలయంతో పాటు పేట వీరభద్ర స్వామి దేవాలయాల అభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. చాలాకాలంగా ఈ దేవాలయాలకు పాలక మండలాలను కూడా ఎంపిక చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వీరశైవుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినా ఏ ఒక్కరికి ఇంతవరకు రుణం మంజూరు కాలేదని విమర్శించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ వీర శైవుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. కమిటీ సభ్యులు కౌశిక్, నీలకంఠ, బద్రి, మంజునాథ్ పాల్గొన్నారు.