Share News

బాబు వస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు : కేఈ

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:12 AM

ఒక్క అవకాశం పేరుతో అధికారం చేపట్టి వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, తిరిగి బాబు అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పత్తికొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు అన్నారు.

బాబు వస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు : కేఈ

పత్తికొండ, ఫిబ్రవరి 26: ఒక్క అవకాశం పేరుతో అధికారం చేపట్టి వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, తిరిగి బాబు అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పత్తికొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు అన్నారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన సోమవారం పత్తికొండ పట్టణంలోని 17వ వార్డులో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. ఇంటింటికి తిరుగుతూ మినీ మేనిఫెస్టో కరపత్రాల ద్వారా టీడీపీ అధికారంలోకి వస్తే చేట్టబోయే పథకాల గురించి వివరించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీకి బుద్ది చెప్పేందుకు ప్రజలు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందని, టీడీపీకి ఓటు వేసి వైసీపీని గద్దె దించాలని ప్రజలను కోరారు. ఆయనతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక బూత్‌ ఇన్‌చార్జీలు ఉన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 12:12 AM