Share News

టెన్త్‌ రీకౌంటింగ్‌ ఫలితాలు విడుదల

ABN , Publish Date - May 29 , 2024 | 03:24 AM

పదో తరగతి రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ ఫలితాలు మొత్తం విడుదల చేసినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ డి.దేవానంద రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు,

టెన్త్‌ రీకౌంటింగ్‌ ఫలితాలు విడుదల

అమరావతి, మే 27 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ ఫలితాలు మొత్తం విడుదల చేసినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ డి.దేవానంద రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 55,996 పేపర్ల ఫలితాలను మూడు విడతల్లో విడుదల చేశామన్నారు. మొదటి విడతలో 43714, రెండో విడతలో 10542, మూడో విడతలో 1710 పేపర్ల ఫలితాలు ప్రధానోపాధ్యాయుల లాగిన్‌లకు పంపామన్నారు. హెచ్‌ఎంలు వీటిని డౌన్‌లోడ్‌ చేసి విద్యార్థులకు ఇవ్వాలన్నారు.

Updated Date - May 29 , 2024 | 08:29 AM