Share News

‘రుషికొండ’పై టీడీపీ జెండా రెపరెపలు

ABN , Publish Date - Jun 05 , 2024 | 04:34 AM

రుషికొండకు బోడిగుండు కొట్టించి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అత్యంత విలాసవంతంగా నిర్మించుకున్న పర్యాటక శాఖ భవనం(సీఎం క్యాంపు కార్యాలయం)పై తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది.

‘రుషికొండ’పై టీడీపీ జెండా రెపరెపలు

విశాఖపట్నం, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): రుషికొండకు బోడిగుండు కొట్టించి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అత్యంత విలాసవంతంగా నిర్మించుకున్న పర్యాటక శాఖ భవనం(సీఎం క్యాంపు కార్యాలయం)పై తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. మంగళవారం మధ్యాహ్నానికే టీడీపీ ఘన విజయం ఖాయమని తేలడంతో ఆ పార్టీ కార్యకర్తలు కొందరు రుషికొండకు చేరుకున్నారు. పర్యాటక భవనం పైకెక్కి తెలుగుదేశం జెండాను ఎగురేశారు. మూడేళ్లుగా ఆ భవనం పరిసరాల్లోకి ఎవరూ రాకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అక్కడ పరిశీలనకు వచ్చిన చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌లను సైతం అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీన్ని తట్టుకోలేకపోయిన టీడీపీ కార్యకర్తలు వైసీపీ ఘోర పరాజయం స్పష్టమవగానే ధైర్యంగా అక్కడికి వెళ్లి జెండా ఎగురవేశారు. అనంతరంపోలీసులు వచ్చి వారిని అక్కడి నుంచి పంపించేశారు.

Updated Date - Jun 05 , 2024 | 04:34 AM