ఎన్డీఏ విజయానికి మాదిగల కృషి
ABN , Publish Date - Mar 26 , 2024 | 03:36 AM
సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి రాష్ట్రంలోని మాదిగలందరూ కృషి చేస్తారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు.
![ఎన్డీఏ విజయానికి మాదిగల కృషి](https://media.andhrajyothy.com/media/2024/20240322/77_e09c787c56.jpg)
పురందేశ్వరితో భేటీలో మంద కృష్ణ
అమరావతి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి రాష్ట్రంలోని మాదిగలందరూ కృషి చేస్తారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరితో ఆయన భేటీ అయ్యారు. ఎన్డీఏ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాలంటూ మంద కృష్ణను పురందేశ్వరి కోరారు. జాతి కోసం పోరాడుతున్న మీకు... అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం శ్రమిస్తోన్న నరేంద్ర మోదీ మాటిచ్చారంటే మీ కల నెరవేరి తీరుతుందని పురందేశ్వరి అన్నారు.