ఎన్నికల్లో డబ్బులిస్తే తీసుకోండి: మంత్రి ధర్మాన
ABN , Publish Date - Mar 22 , 2024 | 03:36 AM
ఓటుకు డబ్బులిస్తే తీసుకోండంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం శ్రీకాకుళంలోని టౌన్హాల్లో నిర్వహించిన పార్టీ సమావేశంలో సొంత పార్టీ నాయకులకే మళ్లీ కండువాలు కప్పి పార్టీలో చేరికల పేరిట హడావుడి చేశారు.
![ఎన్నికల్లో డబ్బులిస్తే తీసుకోండి: మంత్రి ధర్మాన](https://media.andhrajyothy.com/media/2024/20240313/88_d6ca1aa6fd.jpg)
శ్రీకాకుళం క్రైం, మార్చి 21: ఓటుకు డబ్బులిస్తే తీసుకోండంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం శ్రీకాకుళంలోని టౌన్హాల్లో నిర్వహించిన పార్టీ సమావేశంలో సొంత పార్టీ నాయకులకే మళ్లీ కండువాలు కప్పి పార్టీలో చేరికల పేరిట హడావుడి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘ఎన్నికలు వచ్చినప్పుడు డబ్బు ఖర్చు పెట్టి రాజ్యాధికారం పొందడానికి చూస్తారు. డబ్బులు తీసుకోండి. ఆశ పెడితే ఏవైనా అందుకోవాలి. మన లక్ష్యం దిశగా నడిచి మన జీవితాలు బాగుచేసుకోవడానికి పునాదులు వేసుకోవాలి’ అని అన్నారు.