ఆరుగురు నేతలపై టీడీపీ సస్పెన్షన్ వేటు
ABN , Publish Date - Apr 30 , 2024 | 03:53 AM
తెలుగుదేశం పార్టీ నియమ, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన ఆరుగురు నేతలపై సస్పెన్షన్ వేటు పడింది.
అమరావతి, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ నియమ, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన ఆరుగురు నేతలపై సస్పెన్షన్ వేటు పడింది. సివేరి అబ్రహం(అరకు), మీసాల గీత(విజయనగరం), పరమట శ్యాంసుందర్(అమలాపురం), ముడియం సూర్యచంద్రరావు(పోలవరం), వేటుకూరి వెంకట శివరామరాజు(ఉండి), జడ్డా రాజశేఖర్(సత్యవేడు)ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.