శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
ABN , Publish Date - May 27 , 2024 | 03:53 AM
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీటీ రవికుమార్ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ఆదివారం దర్శించుకున్నారు.
![శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
తిరుమల, మే 26 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీటీ రవికుమార్ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ఆదివారం దర్శించుకున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన శనివారం రాత్రి తిరుమలకు వచ్చిన ఆయన ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.