Share News

ఆదరించి గెలిపించండి, అభివృద్ధి చేస్తా

ABN , Publish Date - Apr 06 , 2024 | 01:20 AM

ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో గడప గడపలో సమస్యలు తనకు తెలుసని వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ గుడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు.

ఆదరించి గెలిపించండి, అభివృద్ధి చేస్తా

పుల్లలచెరువు, ఏప్రిల్‌ 5: ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో గడప గడపలో సమస్యలు తనకు తెలుసని వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ గుడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. శుక్రవారం స్థానిక ఎర్రగొండపాలెం పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద సర్వమత ప్రార్థనలతో ఎన్నికల ప్రచార రథాన్ని డాక్టరు మన్నె రవీంద్రతో కలిసి ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని సాయిబాబానగర్‌ మీదుగా పట్టణంలోని మెయిన్‌ రోడ్డులో ఇంటింటికి ప్రచారం చేశారు. బాబు సూపర్‌ సిక్స్‌ కరపత్రాలు పంపిణీ చేశారు. పట్టణంలోని వివిధ వర్గాలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రచారంలో భాగంగా బడ్డీకొట్టులో పకోడీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలో అవినీతి తప్ప ఎక్కడ అభివృద్ధి కనిపించలేదని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఎడాదికి మూడు గ్యాసు సిలిండర్లు, నెలకు 18 నుంచి 60 ఏళ్ళ లోపు మహిళకు 1500 ఆర్ధిక సహాయం, రైతులకు ఏడాదికి రూ.20 వేల సాయం, నిరుద్యోగులకు నెలకు 3 వేల భృతి అందజేస్తామన్నారు. వైసీపీ చేసిన అక్రమలపై టీడీపీ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా వైసీపీకి చెల్లిస్తామన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మంత్రి వున్న నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా వున్నాయని టీడీపీ అధికారంలో వున్నప్పుడు వేసిన రోడ్లు తప్ప ఎక్కడా కొత్త రోడ్లు లేవని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. అనంతరం బాబు జనజ్జీవన్‌రాం విగ్రహనికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టరు మన్నె రవీంద్ర టీడీపీ మండలాధ్యక్షుడు చేకూరి సుబ్బయ్య, మేకల వలరాజు, మెట్టు గోవిందురెడ్డి పయ్యావుల ప్రసాద్‌, మల్లికార్జురెడ్డి టీడీపీ నాయకులు కామేపల్లి వెంకటేశ్వర్లు, రెంటపల్లి సుబ్బారెడ్డి. శనగా నారాయణరెడ్డి, కాకర్ల కోటయ్య, ఇమ్మడిశెట్టి సత్యాలు కొత్త భాస్కర్‌, బాలకోటయ్య, వెంగళరెడ్డి, ఏగినాటి శ్రీనివాస్‌, ఆదిరెడ్డి, దేవినేని చలమయ్య, రవి, ఎరిక్షన్‌బాబు కుమార్తె డాక్టరు చెల్సియా , కుమారుడు అజిత్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పుల్లలచెరువు : ఎర్రగొండపాలెంలోని టీడీపీ కార్యాలయంలో త్రిపురాంతకం మండలంలోని సోమేపల్లి నుంచి పలు కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోకి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌ బాబు మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామాలను గాలికి వదిలేశారన్నారు. వైసీపీ పాలనలో దాచుకోవడం దోచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు సౌనికుల్లా పనిచేసి పార్టీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు మేకల వలరాజు, టీడీపీ నాయకులు మోటుకట్ల శ్రీనివాసరెడ్డి, నాసర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 01:20 AM