Share News

పవన్‌ను కలసిన సుజనా, కామినేని

ABN , Publish Date - Apr 03 , 2024 | 04:02 AM

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి, రాష్ట్ర మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావులు కలుసుకున్నారు.

పవన్‌ను కలసిన సుజనా, కామినేని

తమ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించాలని వినతి

కూటమి పార్టీల మధ్య సమన్వయంపై చర్చ

పిఠాపురం, ఏప్రిల్‌ 2: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి, రాష్ట్ర మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావులు కలుసుకున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కుమారపురంలోని గోకులం గ్రాండ్‌కు వచ్చిన వారు పవన్‌తో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తాము పోటీ చేస్తున్న విజయవాడ పశ్చిమ, కైకలూరు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించాలని సుజనా, కామినేని కోరారు. దీనిపై పవన్‌ సానుకూలంగా స్పందించారు. పవన్‌ను కలిసిన అనంతరం సుజనాచౌదరి మాట్లాడుతూ కూటమి పార్టీలైన జనసేన, టీడీపీ, బీజేపీల మధ్య సమన్వయం, ప్రచారం తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. తన నియోజకవర్గంలో జనసేన తరపున సీటు ఆశించిన పోతిన మహేశ్‌తో మాట్లాడాలని కోరినట్లు చెప్పారు. కూటమి వల్ల అన్ని పార్టీల నేతలు త్యాగాలు చేయవలసి వచ్చిందని తెలిపారు. పొత్తు కుదరడానికి పవన్‌ పడిన కష్టం అంతా ఇంతా కాదని తెలిపారు. పవన్‌ ఏపీ సేవియర్‌గా మారారని చెప్పారు. కూటమి పార్టీల మధ్య పొత్తులో కీలకంగా వ్యవహరించిన పవన్‌కు అభినందనలు తెలిపినట్టు కామినేని శ్రీనివాసరావు తెలిపారు. పవన్‌ను రియల్‌ లైఫ్‌ టైమ్‌ హీరోగా అభివర్ణించారు.

Updated Date - Apr 03 , 2024 | 04:02 AM