సా్ట్రంగ్ రూమ్ మరమ్మతుల్లో వేగం పెంచాలి
ABN , Publish Date - Feb 20 , 2024 | 11:45 PM
మదనపల్లె జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేయనున్న సా్ట్రంగ్ రూమ్ల మరమ్మతు పనులు వేగం పెంచాలని ఆర్డీవో హరిప్రసాద్ సూచించారు.
![సా్ట్రంగ్ రూమ్ మరమ్మతుల్లో వేగం పెంచాలి](https://media.andhrajyothy.com/media/2024/20240215/20mpl_T4_45fc60ffcc.gif)
మదనపల్లె టౌన, ఫిబ్రవరి 20: మదనపల్లె జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేయనున్న సా్ట్రంగ్ రూమ్ల మరమ్మతు పనులు వేగం పెంచాలని ఆర్డీవో హరిప్రసాద్ సూచించారు. మంగళవారం స్థానిక జడ్పీహైస్కూ ల్లో సా్ట్రంగ్ రూమ్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు రోజు సా్ట్రంగ్రూమ్లో భద్రప రచిన ఈవీఎంలు, వీవీ ప్యాట్ యంత్రాల పంపిణీ ఒక వైపు చేయా లన్నారు. ఎన్నికలు ముగిశాక తిరిగి ఇక్కడికి చేరుకునే ఈవీఎంలు, వీవీ ప్యాట్లను సా్ట్రంగ్ రూమ్లో ఎలా భద్రపరచాలో వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, సర్వేయర్ సుబ్రమణ్యం, ఈ డీటీ ఆస్లాం తదితరులు పాల్గొన్నారు.