Share News

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు : ఎస్‌ఐ

ABN , Publish Date - Feb 07 , 2024 | 11:22 PM

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు.

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు : ఎస్‌ఐ
ప్రజలతో మాట్లాడుతున్న ఎస్‌ఐ

గాలివీడు, ఫిబ్రవరి 7: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. ఆయన బుధవారం ఉదయం చీమలచెరువుపల్లె పంచాయతీలోని రెడ్డివారిపల్లెలో కార్డెన్‌సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయని, పల్లెల్లోని ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని, ఘర్షణలకు వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. అనంతరం పలు ఇళ్లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2024 | 11:22 PM