Share News

టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి

ABN , Publish Date - Feb 11 , 2024 | 11:58 PM

రాక్షస వైసీపీ పార్టీని భూస్థాపితం చేసి టీడీపీకి పట్టం కడుదామని పత్తికొండ టీడీపీ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు అన్నారు.

టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి
బొందిమడుగులలో శ్యాంబాబుకు సమస్యలు వివరిస్తున్నవృద్ధురాలు

టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి : కేఈ శ్యాంబాబు

తుగ్గలి, ఫిబ్రవరి 11: రాక్షస వైసీపీ పార్టీని భూస్థాపితం చేసి టీడీపీకి పట్టం కడుదామని పత్తికొండ టీడీపీ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని బొందిమడుగులలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి వివరించారు. అలాగే గ్రామానికి తాగునీరు అందించాలని స్థానికులు కోరారు. ఈ సందర్భంగా కేఈ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఇంటింటికీ కొళాయి వేయిస్తామని, ప్రతి ఇంటికీ అన్ని సంక్షేమ పథకాలు అందుతాయని భరోసా ఇచ్చారు. మహాశక్తి పేరుతో మినీ మేనిఫెస్టోను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేశారని, ఈ మహాశక్తి, తల్లికి వందనం పథకాలతో మహిళలు అభివృద్ధి చెందుతారని పేర్కొన్నారు. ఒక్కచాన్స్‌ అంటూ గద్దెనెక్కి రాష్ట్రాన్ని అధోగతి పాల్చేశారని, ఇలాంటి పిచ్చి తుగ్లక్‌కు ఓటుతోనే బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తిరుపాల్‌ నాయుడు, ప్రతాప్‌యాదవ్‌, వెంకట్రాముడు, మోహన్‌ యాదవ్‌, తలారి రాముడు, కేపీ రమేష్‌, దేవదాసు గౌడు, నల్లగుండ్ల రవి, మహేష్‌గౌడు, చంద్రశేఖర్‌ యాదవ్‌, వెంకటేశ్వర్లు, క్రిష్ణ, సోమశేఖర్‌గౌడు, దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

సైనికుల్లా పని చేయాలి : కేఈ

మద్దికెర : తెలుగుదేశం పార్టీ విజయం కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని తాలుకా తెలుగు యువత ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు అన్నారు. మద్దికెర గ్రామానికి చెందిన గౌండా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న 40 మంది తెలుగు యువత కార్యకర్తలు ఆదివారం టీడీపీ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబును సన్మానించారు. కార్యక్రమంలో మద్దికెర గ్రామానికి చెందిన తెలుగు యువత నాయకులు గడ్డం మల్లికార్జున, ఈశ్వరయ్య, తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 11 , 2024 | 11:58 PM