Share News

అనంత, చిత్తూరు జట్ల విజయం

ABN , Publish Date - Jun 02 , 2024 | 12:16 AM

ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన సౌతజోన అండర్‌-19 వన్డే క్రికెట్‌ పోటీల్లో అనంతపురం, చిత్తూరు జట్లు విజయం సాధించాయి. శనివారం స్థానిక అనంత క్రీడాగ్రామం ఆర్డీటీ స్టేడియంలో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన సౌతజోన అండర్‌-19 వన్డే క్రికెట్‌ పోటీలు కొనసాగాయి.

అనంత, చిత్తూరు జట్ల విజయం

అనంతపురం క్లాక్‌టవర్‌, జూన 1: ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన సౌతజోన అండర్‌-19 వన్డే క్రికెట్‌ పోటీల్లో అనంతపురం, చిత్తూరు జట్లు విజయం సాధించాయి. శనివారం స్థానిక అనంత క్రీడాగ్రామం ఆర్డీటీ స్టేడియంలో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన సౌతజోన అండర్‌-19 వన్డే క్రికెట్‌ పోటీలు కొనసాగాయి. అనంతపురం, కర్నూలు జట్ల మధ్య మ్యాచ జరగ్గా మొదట బ్యాటింగ్‌ చేసిన అనంతపురం 49.2ఓవర్లలో 197పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. అనంతరం బరిలోకి దిగిన కర్నూలు జట్టు 34.4ఓవర్ల్లలో 148పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. అనంతపురం జట్లు 49పరుగుల తేడాతో విజయం సాధించింది. అనంతపురం బౌలర్‌ సాహిల్‌ 4 వికెట్ల్లు తీసి మ్యానఆ్‌ఫది మ్యాచ అవార్డు అందుకున్నాడు. మరో మ్యాచలో చిత్తూరు, నెల్లూరు జట్లు తలపడగా మొద ట బ్యాటింగ్‌ చేసిన నెల్లూరు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన చిత్తూరు 33.2ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 278పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చిత్తూరు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సెంచరీ కొట్టిన రుషీల్‌రెడ్డి మ్యాన ఆఫ్‌ది మ్యాచ అవార్డు అందుకున్నాడు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్‌ సంఘం కార్యదర్శి మధు ఆచారి, కోచలు, సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2024 | 12:16 AM