Share News

ఏపీఎన్జీజీవో నూతన అధ్యక్షుడిగా శివారెడ్డి

ABN , Publish Date - Mar 01 , 2024 | 03:11 AM

ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ గజిటెడ్‌ అండ్‌ గజిటెడ్‌ ఆఫీసర్స్‌ (ఏపీఎన్‌జీజీఓ) అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కేవీ శివారెడ్డి, చౌదరి పురుషోత్తమనాయుడు ఎంపికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు బండి శ్రీనివాసరావుకు మార్చి నెలలో పదవీ

ఏపీఎన్జీజీవో నూతన అధ్యక్షుడిగా శివారెడ్డి

విజయవాడ, ఫిబ్రవరి 29(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ గజిటెడ్‌ అండ్‌ గజిటెడ్‌ ఆఫీసర్స్‌ (ఏపీఎన్‌జీజీఓ) అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కేవీ శివారెడ్డి, చౌదరి పురుషోత్తమనాయుడు ఎంపికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు బండి శ్రీనివాసరావుకు మార్చి నెలలో పదవీ విరమణ ఉండడంతో.. ఆయన తన బాధ్యతల నుంచి తప్పుకోగా, ఇప్పటి వరకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న కేవీ శివారెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గురువారం ఏపీఎన్‌జీఓ భవన్‌లో రాష్ట్ర సెక్రటేరియట్‌, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వీరిద్దరినీ కో ఆప్షన్‌ విధానంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సహాధ్యక్షులుగా వి.దస్తగిరి రెడ్డి (కర్నూలు), ఉపాధ్యక్షుడిగా బి.వెంకటేశ్వర్లు (నెల్లూరు) ఎన్నికయ్యారు. శివారెడ్డి మాట్లాడుతూ, ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం నుంచి రాబట్టడమే తమ కర్తవ్యంగా ముందుకు సాగుతామన్నారు. ఏపీఎన్‌జీఈఓ అధ్యక్షుడిగా అమూల్యమైన సేవలు అందించిన బండి శ్రీనివాసరావును తాడేపల్లిలో మార్చి 6న ఘనంగా సత్కరించనున్నట్లు తెలిపారు.

Updated Date - Mar 01 , 2024 | 09:35 AM