Share News

కార్పొరేషన్‌ కార్యాలయాల ముట్టడి

ABN , Publish Date - Jan 07 , 2024 | 04:04 AM

మున్సిపల్‌ కార్మికులు కదం తొక్కారు. సమస్యల పరిష్కారం కోరుతూ వారు చేపట్టిన సమ్మె శనివారం 12వ రోజూ కొనసాగింది.

కార్పొరేషన్‌ కార్యాలయాల ముట్టడి

12వ రోజు ఉధృతంగా సమ్మె

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

మున్సిపల్‌ కార్మికులు కదం తొక్కారు. సమస్యల పరిష్కారం కోరుతూ వారు చేపట్టిన సమ్మె శనివారం 12వ రోజూ కొనసాగింది. అనంతపురం నగరంలో సీఐటీయూ, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు రామిరెడ్డి, ఆర్వీ నాయుడు ఆధ్వర్యంలో కార్పొరేషన్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. కమిషనర్‌ చాంబర్‌ నుంచి అధికారులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. అక్కడే తలకిందులుగా నిలబడి నిరసన తెలిపారు. సప్తగిరి సర్కిల్‌లో ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. తాడిపత్రి మున్సిపల్‌ కార్యాలయంలో చెత్త పారబోసి నిరసన తెలిపారు. నెల్లూరులోని బారాషహీద్‌ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి నగరపాలకసంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. వీరి ఆందోళనకు కార్పొరేషన్‌లోని కంప్యూటర్‌ ఆపరేటర్లు సంఘీభావం తెలిపారు.

Updated Date - Jan 07 , 2024 | 04:04 AM