నేడు షర్మిల ఆలూరుకు రాక
ABN , Publish Date - Apr 19 , 2024 | 12:18 AM
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆలూరుకు రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాబురావు తెలిపారు.
ఆలూరు, ఏప్రిల్ 17: ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆలూరుకు రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాబురావు తెలిపారు. గురువారం రాత్రి అతిథి హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గురువారం రాత్రి చిప్పగిరిలో షర్మిల బస చేస్తారని, శుక్రవారం ఉదయం బయలుదేరి 10 గంటలకు ఆలూరు అంబేద్కర్ కూడలిలో జరిగే సభలో పాల్గొంటారని తెలపారు. ఆలూరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు.