బీజేపీ సీనియర్ నాయకుడు దే వేంద్రగౌడ్ మృతి
ABN , Publish Date - Apr 26 , 2024 | 11:03 PM
ఎమ్మిగనూరుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, వీరశైవ ఐక్యవేదిక సంఘటన రాష్ట్ర అధ్యక్షుడు వై దేవేంద్రగౌడ్(77)శుక్రవారం కన్నుముశారు.
ఎమ్మిగనూరు, ఏప్రిల్ 26: ఎమ్మిగనూరుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, వీరశైవ ఐక్యవేదిక సంఘటన రాష్ట్ర అధ్యక్షుడు వై దేవేంద్రగౌడ్(77)శుక్రవారం కన్నుముశారు. ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో చికిత్స నిమిత్తం ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతిచెందాడు. దేవేంద్రగౌడ్ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గా ఎమ్మిగనూరు కు పోటీ చేశారు. ఆయన గతంలో ఎమ్మిగనూరు బార్ అసోషియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు.