Share News

గ్రూప్‌-2 మెయిన్స్‌కు ఎంపిక నిష్పత్తి పెంచాలి

ABN , Publish Date - Feb 28 , 2024 | 03:18 AM

గ్రూప్‌-2 ప్రశ్నపత్రం అత్యంత కఠినంగా ఇచ్చినందున మెయిన్స్‌కు ఎంపికచేసే అభ్యర్థుల నిష్పత్తిని 1:100కు పెంచాలని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ షేక్‌

గ్రూప్‌-2 మెయిన్స్‌కు ఎంపిక నిష్పత్తి పెంచాలి

అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-2 ప్రశ్నపత్రం అత్యంత కఠినంగా ఇచ్చినందున మెయిన్స్‌కు ఎంపికచేసే అభ్యర్థుల నిష్పత్తిని 1:100కు పెంచాలని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ షేక్‌ సిద్ధిక్‌ ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. సిలబస్‌ పరిధి దాటి ప్రశ్నలు ఇచ్చారని, గ్రామీణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. సామాజిక శాస్త్రం, గణితం ప్రశ్నలు చదవడానికే ఎక్కువ సమయం పట్టిందని, స్థాయికి మించిన ప్రశ్నలు ఇచ్చి నిరుద్యోగులను ఆందోళనకు గురిచేశారని ఆక్షేపించారు.

Updated Date - Feb 28 , 2024 | 08:35 AM