Share News

MLA Pinnelli: పిన్నెల్లిపై సెక్షన్‌ 307

ABN , Publish Date - May 25 , 2024 | 04:19 AM

ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎం ఆంజనేయులు శుక్రవారం తెలిపారు..

MLA Pinnelli: పిన్నెల్లిపై సెక్షన్‌ 307

  • టీడీపీ ఏజెంట్‌పై దాడి ఘటనలో నమోదు

  • టీడీపీ ఏజెంట్‌పై దాడి ఘటనలో..

మాచర్లటౌన్‌, మే 24 : ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై (Pinnelli Ramakrishna Reddy) హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎం ఆంజనేయులు శుక్రవారం తెలిపారు. ఈ నెల 13న పాల్వాయి గేటులోని పోలింగ్‌ కేంద్రంలో దౌర్జాన్యానికి సంబంధించి టీడీపీ ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశామన్నారు. పోలింగ్‌ కేంద్రంలో రామకృష్ణారెడ్డి ఈవీఎం మిషన్‌ ధ్వంసం చేస్తున్న సందర్భంగా అడ్డుకునేందుకు వెళ్లిన శేషగిరిరావును దుర్భాషలాడి, బయటకు లాగి మారణాయుధంతో తలపై దాడి చేశారు. ఈ దాడిలో శేషగిరిరావు తలకు ఆరు కుట్లు పడ్డాయి. భయం గుప్పిట్లో వారం రోజుల తర్వాత అజ్ఞాతం వీడి.. టీడీపీ మాచర్ల అభ్యర్థి బ్రహ్మారెడ్డి, వర్ల రామయ్య, ఎస్టీ నేత ధారునాయక్‌లతో కలిసి ఆయన డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రామకృష్ణారెడ్డిపై 307 సెక్షన్‌ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

Updated Date - May 25 , 2024 | 09:48 AM