డీజీపీని ఎన్నికల విధుల నుంచి తప్పించండి
ABN , Publish Date - Apr 26 , 2024 | 04:27 AM
రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీ నేతలపై దాడులు జరుగుతున్నా, శాంతిభద్రతల్లో వైఫల్యం ఉన్నా పట్టించుకోని డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని బీజేపీ నేత భానుప్రకాశ్రెడ్డి ఫిర్యాదు చేశారు.
సీఈవోకు బీజేపీ ఫిర్యాదు
అమరావతి, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీ నేతలపై దాడులు జరుగుతున్నా, శాంతిభద్రతల్లో వైఫల్యం ఉన్నా పట్టించుకోని డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని బీజేపీ నేత భానుప్రకాశ్రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం భానుప్రకా్షరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు నిష్పక్షపాతంగా ఉండేలా చూడాలని, కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన విధివిధానాలను నిష్పక్షపాతంగా అమలు చేయాలని సీఈవోను కోరామన్నారు.