ప్రశాంతంగా గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష
ABN , Publish Date - Feb 25 , 2024 | 11:46 PM
ఎపీపీఎస్సీ ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష ఆదోని పట్టణంలోని పరీక్షా కేంద్రాలలో ప్రశాంతంగా జరిగింది.
![ప్రశాంతంగా గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఆదోని (అగ్రికల్చర్), ఫిబ్రవరి 25: ఎపీపీఎస్సీ ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష ఆదోని పట్టణంలోని పరీక్షా కేంద్రాలలో ప్రశాంతంగా జరిగింది. ఉదయం 8.30 గంటలకే పరీక్షా కేంద్రాల వద్ద సందడి నెలకొంది. గంట ముందుగానే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిచ్చారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. ఆదోని డివిజన్లో మొత్తం 40 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా పట్టణంలో 21, ఎమ్మిగనూరులో 16, మంత్రాలయంలో మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆర్ట్స్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఆదోని సబ్ కలెక్టర్ శివనారాయణ శర్మ తనిఖీ చేశారు. సీసీ ఫుటేజీ ద్వారా పరీక్ష కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ రజనీకాంత్ రెడ్డి ఉన్నారు.