Share News

యువకవి రాజశేఖర్‌కు రాయల సాహితీ పురస్కారం

ABN , Publish Date - Feb 29 , 2024 | 12:03 AM

సత్యసాయి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారిగా కవితా యాత్ర కార్యక్రమం నిర్వహించారు.

యువకవి రాజశేఖర్‌కు రాయల సాహితీ పురస్కారం

ఆలూరు, ఫిబ్రవరి 28: సత్యసాయి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారిగా కవితా యాత్ర కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా ఆలూరు మండలం కమ్మరచేడు గ్రామానికి చెందిన యువ రచయిత యం రాజశేఖర్‌కు రాయల సాహితీ పురస్కారం లభించింది. జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో సన్మానం చేశారు. చారిత్రక స్థలంలో ఒకప్పటి అష్టదిగ్గజాల కవులు జరిపిన సాహితీ వైభవం పై వివరించాడు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జాబిలి చాంద్‌ బాషా, ఉమర్‌ షారుక్‌ ఖాన్‌, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం గ్రహీత చదువుల బాబు, పెనుగోండ పురప్రముఖులు పాల్గొన్నారు.

Updated Date - Feb 29 , 2024 | 12:03 AM