రమణీయం.... రాఘవేంద్రుల స్వర్ణ పల్లకోత్సవం
ABN , Publish Date - Apr 25 , 2024 | 11:28 PM
రాఘవేంద్రుని స్వర్ణ పల్లకోత్సవం రమణీయంగా నిర్వహించారు.
![రమణీయం.... రాఘవేంద్రుల స్వర్ణ పల్లకోత్సవం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
మంత్రాలయం, ఏప్రిల్ 25 : రాఘవేంద్రుని స్వర్ణ పల్లకోత్సవం రమణీయంగా నిర్వహించారు. గురువారం పీఠాఽధిపతి సుబుధేంద్రతీర్థుల ఆధ్వర్యంలో మఠం పండితులు,అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.రాఘవేంద్రస్వామి బృందావన ప్రతిమను స్వర్ణపల్లకిలో అధిష్టించి రమణీయంగా ఊరేగించారు. భక్తులు గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్రస్వామికి విశేషపూజలు చేసిమొక్కులు తీర్చుకున్నారు.
మంత్రాలయంలో కి క్కిర్సిన భక్తులు : రాఘవేంద్ర స్వామి ధర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం కిక్కిర్సింది. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, ప్రధాన రహాదారులు, మధ్వమార్గ్ కారిడార్, రాఘవేంద్ర సర్కిల్, నదితీరం భక్తులతో కోలాహాలంగా మారింది. క్యూలైన్న్లు, పరిమళప్రసాదం వద్ద భక్తుల సందడిగా మారింది.