Share News

రైతు ద్రోహి జగన్‌రెడ్డి : రమేశ్‌కుమార్‌రెడ్డి

ABN , Publish Date - Jan 08 , 2024 | 11:45 PM

రైతులకు ఉరివేసి ఇరిగేషన్‌ను బలిచేసిన రైతు ద్రోహి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రమేశ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

రైతు ద్రోహి జగన్‌రెడ్డి : రమేశ్‌కుమార్‌రెడ్డి
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న రమేశ్‌కుమార్‌రెడ్డి

రాయచోటిటౌన్‌, జనవరి 8: రైతులకు ఉరివేసి ఇరిగేషన్‌ను బలిచేసిన రైతు ద్రోహి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రమేశ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన స్థానిక టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జగన్‌రెడ్డి వ్యవసాయశాఖను మూసేశారని, హార్టికల్చర్‌ రైతులు ఒకపక్క రోడ్డున పడ్డారని, ధాన్యం పండించిన రైతులు పూర్తిగా దగాపడ్డారన్నారు. రైతులు పండించిన ధాన్యం కొనేవారు లేక, డ్రిప్‌ సబ్సిడీలు లేక ఒకపక్క మద్దతు ధర కూడా ప్రభుత్వం నుంచి రాక అన్నదాతలకు బతుకే లేకుండా చేశారని, రాష్ర్టాన్ని గోదావరిలో జగన్‌రెడ్డి కలిపేశారన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా, మాజీ జడ్పీటీసీ నరసారెడ్డి, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ కాలాడి ప్రభాకర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బోనమల ఖాదర్‌వలి, సంబేపల్లె మండల టీడీపీ అధ్యక్షుడు చిన్నరెడ్డెయ్యయాదవ్‌, రాజంపేట పార్లమెంటరీ బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి రెడ్డెప్ప, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 11:45 PM