పులివెందులలో ప్రజాస్వామ్య పరిరక్షణకు దేనికైనా సిద్ధం
ABN , Publish Date - Apr 25 , 2024 | 03:59 AM
పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు దేనికైనా సిద్ధమని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మారెడ్డి రవీంద్రనాథరెడ్డి (బీటెక్ రవి) చెప్పారు.
స్వేచ్ఛాయుత ఓటింగ్కు సహకరిస్తా : బీటెక్ రవి
పులివెందుల, ఏప్రిల్ 24: పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు దేనికైనా సిద్ధమని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మారెడ్డి రవీంద్రనాథరెడ్డి (బీటెక్ రవి) చెప్పారు. బుధవారం నామినేషన్ దాఖలు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పులివెందులలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కృషిచేస్తానని చెప్పారు. జగన్కు వ్యతిరేకంగా ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. కడప పార్లమెంట్ అభ్యర్థి భూపేశ్రెడ్డి మాట్లాడుతూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.