Share News

అధికారమే లక్ష్యంగా నేతల కుప్పిగంతులు

ABN , Publish Date - Feb 13 , 2024 | 02:25 AM

నేడు కుప్పిగంతుల రాజకీయాలు బాగా పెరిగిపోయాయి. ప్రస్తుతం చాలా విచారకరమైన రాజకీయాలు నడుస్తున్నాయి’ అని మాజీ సీజేఐ ఎన్వీ రమణ అన్నారు.

అధికారమే లక్ష్యంగా నేతల కుప్పిగంతులు

నోటిఫికేషన్‌కు ముందు రోజు పార్టీ మారుతున్నారు: జస్టిస్‌ ఎన్వీ రమణ

విజయవాడ(లబ్బీపేట), ఫిబ్రవరి 12: ‘నేడు కుప్పిగంతుల రాజకీయాలు బాగా పెరిగిపోయాయి. ప్రస్తుతం చాలా విచారకరమైన రాజకీయాలు నడుస్తున్నాయి’ అని మాజీ సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నాలుగు సంవత్సరాల 11 నెలల రెండు రోజులు ఒక పార్టీలో అధికారంలో ఉంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే ఒక్క రోజు ముందు పార్టీ మారి మరలా గెలవబోయే పార్టీలో చేరుతున్నారు. మరలా అధికారం అనుభవించడానికి సిద్ధపడుతున్న దుర్మార్గమైన పరిస్థితి సమాజంలో ఉంది. ప్రజాదరణ, ప్రజామద్దతు లేకపోయినా రాజకీయ పార్టీలు, నేతలు వారిని డబ్బు సంచులతో అక్కున చేర్చుకోవడం దురదృష్టకరం. అధికారమే లక్ష్యంగా కుప్పిగంతులు వేసే నాయకులకు బుద్ధి చెప్పాలి. ముందు ముందు ఎటువంటి పెడదోవలు చూడాలో అని ఆవేదన కలుగుతుంది’ అని జస్టిస్‌ రమణ అన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 02:25 AM