‘పోలవరం’ బాధితుడి ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - May 25 , 2024 | 04:02 AM
ఇతడి పేరు ఉన్నమట్ల సీతారామయ్య(75). స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం. పోలవరం ప్రాజెక్టు ముంపు బాధిత గ్రామం. స్వగ్రామంలో ఇల్లు, భూములు ఉన్నా..
![‘పోలవరం’ బాధితుడి ఆత్మహత్యాయత్నం](https://media.andhrajyothy.com/media/2024/20240511/gg_ea158b1512.jpg)
రాజమహేంద్రవరం అర్బన్/దేవీపట్నం, మే 24: ఇతడి పేరు ఉన్నమట్ల సీతారామయ్య(75). స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం. పోలవరం ప్రాజెక్టు ముంపు బాధిత గ్రామం. స్వగ్రామంలో ఇల్లు, భూములు ఉన్నా.. అవన్నీ ప్రాజెక్టు ముంపులో పోయాయి. ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ రానేలేదు. అదేమని అధికారులను అడిగితే జాబితాలో పేరు లేదని చెబుతున్నారు. గత ఆరేళ్లుగా అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న అతడు.. శుక్రవారం కూడా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు అధికారి కార్యాలయానికి వచ్చాడు. అయితే జాబితాలో పేరు లేదని, రంపచోడవరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాలని అక్కడి అధికారులు చెప్పారు. అక్కడికీ అనేకసార్లు వెళ్లిన సీతారామయ్య... ఇక తనకు నష్టపరిహారం దక్కదనే ఆవేదనతో.. ఆ కార్యాలయం ముందే పురుగుల మందు తాగేశాడు. ప్రస్తుతం రాజమహేంద్రవరం జీజీహెచ్లో చావుబతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నాడు.