Share News

ప్రజలు కసితీరా ఓటు వేశారు

ABN , Publish Date - May 15 , 2024 | 11:22 PM

అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలన్న కసితో కసితీర ప్రజలు ఎన్నికల్లో ఓటు వేశారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

ప్రజలు కసితీరా ఓటు వేశారు

ఎన్డీయే కూటమి విజయదుందిబి మోగించనుంది

జూన్‌4న ముఖ్యమంత్రిగా చంద్రబాబు పీఠం ఎక్కనున్నారు

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి బీవీ

ఎమ్మిగనూరు, మే 15 : అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలన్న కసితో కసితీర ప్రజలు ఎన్నికల్లో ఓటు వేశారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఆయా వార్డుల్లో పర్యటించి టీడీపీ ఇన్‌చార్జులు, కార్యకర్తలతో మాట్లాడారు. వార్డుల పరిధిలో ఉన్నబూత్‌ల్లో పోలింగ్‌ ఏవిధంగా జరిగింది.. ఎంతశాతం జరిగింది, స్థానిక కార్యకర్తలు ఎలా పనిచేశారు, ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపారు అనే విషయాలపై చర్చించారు. ఎక్కడెక్కడ ఏఏ లోటుపాట్లు జరిగాయనే విషయాలను కూడా ఆరా తీశారు. ఈ సందర్భంగా వడ్డె వీధిలో కలిసిన ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలన్న కసితో ఓటు వేశారన్నారు. అలాగే ఓటింగ్‌శాతం కూడా పెరగడం అనేది కేవలం అధికార పార్టీపై ఉన్న వ్యతిరేఖతతోనేనన్నారు. పోలింగ్‌ శాతం పెరగడం ప్రతిపక్షానికి అనుకూలం అన్నారు. ఎన్డీయే కూటమి విజయదుందుబి మోగిస్తుందన్నారు. జూన్‌ 4వ తేదీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్నారు. ఆయన వెంట టీడీపీ నాయకులు కటారి రాజేంద్ర, దేవేంద్ర, గుల్లా సలాం, లోకేష్‌నాయుడు, జగదీష్‌ ఆయా వార్డుల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2024 | 11:22 PM