ప్రశాంత ఎన్నికలకు ప్రజలు సహకరించాలి
ABN , Publish Date - Mar 28 , 2024 | 12:14 AM
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహ కరించాలని పీలేరు అర్బన సీఐ మోహ నరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పీలేరు, మార్చి 27: త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహ కరించాలని పీలేరు అర్బన సీఐ మోహ నరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్ని కల సన్నాహాల్లో భాగంగా బుధవారం ఆయన సీఆర్పీఎఫ్ బలగాలతో కలిసి మండలంలోని దొడ్డిపల్లె, అగ్రహారం, ఎర్ర గుంటపల్లె పంచాయతీల్లో కవాతు నిర్వ హించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఎన్నికల సమయంలో గ్రామస్థులు సంయమనం పాటించి వ్యక్తిగత దూషణలు, ఆధిపత్య ధోరణిని వీడాలన్నా రు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి ఇబ్బంది కలిగినా తమను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ నరసింహుడు, ఏఎస్ఐ హేమసుందర్ జెట్టి, సిబ్బంది పాల్గొన్నారు.