ప్రజలు టీడీపీ మేనిఫెస్టోను నమ్మారు
ABN , Publish Date - Jun 10 , 2024 | 03:14 AM
ప్రజలు టీడీపీ మేనిఫెస్టోను నమ్మి ఓటు వేశారని, దీనిపై చర్చ ఎందుకని అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని వ్యాఖ్యానించారు.
![ప్రజలు టీడీపీ మేనిఫెస్టోను నమ్మారు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం
తిరుమల, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): ప్రజలు టీడీపీ మేనిఫెస్టోను నమ్మి ఓటు వేశారని, దీనిపై చర్చ ఎందుకని అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని వ్యాఖ్యానించారు. తిరుమల శ్రీవారిని ఆదివారం దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఓడిపోవడంపై స్పందిస్తూ ‘ఇది ప్రజాతీర్పు అన్నారు. ఆ తీర్పుకు శిరసా వహించాల్సిందే. సీన్ ఈజ్ ఓవర్’ అన్నారు. 40 శాతం ఓట్లు వచ్చాయని ఇప్పటికే జగన్మోహన్రెడ్డి తెలిపారని, అక్కడినుంచి నిలబడి వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతామని చెప్పారు. ఇదే తమ ప్రధాన అజెండా అని చెప్పారు.