1న ఇళ్ల వద్దే పింఛన్లు ఇవ్వాలి: రామకృష్ణ
ABN , Publish Date - Apr 27 , 2024 | 04:12 AM
రాష్ట్రంలో వృద్ధులకు ఒకటో తేదీనే ఫించన్లు పంపిణీ చేయాలి. లేకుంటే ఎన్నికల కోడ్ ఉన్నా నిరసన తెలుపుతాం’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు.
అనంతపురం, ఏప్రిల్ 26: ‘రాష్ట్రంలో వృద్ధులకు ఒకటో తేదీనే ఫించన్లు పంపిణీ చేయాలి. లేకుంటే ఎన్నికల కోడ్ ఉన్నా నిరసన తెలుపుతాం’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. అనంతపురం నగరంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘రాష్ట్రంలో 66 లక్షల మంది ఫించన్దారులు ఉన్నారు. వారికి మే 1నే పింఛన్ చెల్లించాలి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.26 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. ఒక్కొక్కరు 50 మందికి పింఛన్ అందించేలా బాధ్యతలు అప్పగించాలి. ఒకటో తేదీ మధ్యాహ్నానికి ఫించన్ల పంపిణీ పూర్తి చేయాలి. లేదంటే ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపడతాం’ అని రామకృష్ణ హెచ్చరించారు.