పవన్ కల్యాణ్కు తీవ్ర జ్వరం..!
ABN , Publish Date - Apr 04 , 2024 | 04:34 AM
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరం బారిన పడ్డారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 2వ తేదీ సాయంత్రం వరకూ పిఠాపురంలో ఆయన పర్యటించారు.
![పవన్ కల్యాణ్కు తీవ్ర జ్వరం..!](https://media.andhrajyothy.com/media/2024/20240326/kk_f9b100524a.jpg)
తెనాలి, ఉత్తరాంధ్ర పర్యటనలు రద్దు
అమరావతి, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరం బారిన పడ్డారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 2వ తేదీ సాయంత్రం వరకూ పిఠాపురంలో ఆయన పర్యటించారు. చివరి రోజు 10 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. సోమవారం నుంచే జ్వరంతో ఇబ్బందిపడుతున్న ఆయన మంగళవారమూ తన పర్యటనను కొనసాగించారు. బుధవారం నాటికి జ్వరం మరింత తీవ్రం కావడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ వెళ్లారు. ఆయనకు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు.దీంతో పవన్ పర్యటనలు రద్దయ్యాయి.