Share News

వైసీపీ సమావేశానికి పంచాయతీ ట్యాంకర్‌

ABN , Publish Date - Apr 22 , 2024 | 11:54 PM

వాల్మీకిపురం పట్టణంలోని తిరుపతి రోడ్డులో సోమవా రం నిర్వహించిన వైసీపీ కార్యకర్తల సమా వేశానికి గ్రామ పంచాయతీ నీటి ట్యాంకర్‌ ను వాడుకున్నారు.

వైసీపీ సమావేశానికి పంచాయతీ ట్యాంకర్‌
వైసీపీ సమావేశం ప్రాంగణం వద్ద ఉన్న పంచాయతీ ట్యాంకర్‌

వాల్మీకిపురం, ఏప్రిల్‌ 22: వాల్మీకిపురం పట్టణంలోని తిరుపతి రోడ్డులో సోమవా రం నిర్వహించిన వైసీపీ కార్యకర్తల సమా వేశానికి గ్రామ పంచాయతీ నీటి ట్యాంకర్‌ ను వాడుకున్నారు. కార్యకర్తల సమావే శం ప్రాంగణం వద్ద గ్రామ పంచాయతీ నీటి ట్యాంకర్‌ కనిపించడంతో వ్యవహారం జిల్లా అధికారుల దాకా వెళ్లింది. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో స్థానిక అధికారులు సైతం జిల్లాఅధికారుల ఆదేశాలతో అప్రమత్తమయ్యారు. ఈ విషయమై స్థానిక ఎంపీడీవో సుధాకర్‌రెడ్డిని వివరణ కోరగా సమావేశం ప్రాంగణం వద్ద గ్రామ పంచాయతీ ట్యాంకర్‌ను గమనించి అప్పటికప్పుడే తొలగించడం జరిగింద న్నారు. ప్రైవేట్‌ ట్యాంకర్‌ పెట్టుకోవాలని చెప్పిన సందర్భంలో పంచాయతీ కార్మికులు పంచాయతీ ట్యాంకర్‌ పెట్టారని అయితే గమనించిన తక్షిణం వెళ్లి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.

Updated Date - Apr 22 , 2024 | 11:54 PM