Share News

ముగిసిన పద్మావతీ పరిణయోత్సవం

ABN , Publish Date - May 20 , 2024 | 04:01 AM

తిరుమలలో మూడు రోజులుగా నిర్వహించిన పద్మావతీ శ్రీనివాసుల పరిణయ మహోత్సవం ఆదివారం రాత్రి ఘనంగా ముగిసింది.

ముగిసిన పద్మావతీ పరిణయోత్సవం

తిరుమల, మే 19 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో మూడు రోజులుగా నిర్వహించిన పద్మావతీ శ్రీనివాసుల పరిణయ మహోత్సవం ఆదివారం రాత్రి ఘనంగా ముగిసింది. సాయంత్రం ఆలయం నుంచి శ్రీవారు గరుడ వాహనంపై, దేవేరులు పల్లకీపై ఊరేగింపుగా బయల్దేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పరిణయోత్సవ మండపానికి వేంచేశారు. ఎదుర్కోలు, పూలచెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ తదితర కల్యా ణ వేడుకలు ఘనంగా ముగించిన తర్వాత కొలువు జరిగింది. వేదపారాయణం తరువాత కళాకారులు అన్నమయ్య కీర్తలను ఆలపించారు. ఉత్సవమూర్తులు తిరిగి ఊరేగింపుగా ఆలయానికి చేరుకోవడంతో పరిణయోత్సవం వైభవంగా ముగిసింది.

Updated Date - May 20 , 2024 | 04:01 AM