పాత పెన్షన్పై హామీ ఇచ్చే వారికే మా ఓటు
ABN , Publish Date - Feb 26 , 2024 | 11:52 PM
ఉద్యోగ, ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరికాదని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్.జాబీర్ ఆక్షేపించారు.
![పాత పెన్షన్పై హామీ ఇచ్చే వారికే మా ఓటు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాబీర్
రాయచోటిటౌన్, ఫిబ్రవరి 26: ఉద్యోగ, ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరికాదని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్.జాబీర్ ఆక్షేపించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు సైతం ప్రభుత్వంలో భాగమేనని గుర్తించి వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం స్థానిక అలీమాబాద్వీధిలో గల ఉర్దూ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఓట్ ఫర్ ఓపీఎస్ బుక్లెట్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హామీలు ఇవ్వని పక్క రాష్ర్టాలు సైతం పాత పెన్షన్ విధానం వైపు అడుగులు వేస్తుంటే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సీఎం జగన్ ఉద్యోగులను మోసగిస్తుండటం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాయచోటి మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హఫీజుల్లా, రాజారమేశ్, సీపీఎ్స జిల్లా సబ్ కమిటీ సభ్యులు చాన్బాషా, మండల కన్వీనర్ రాజబాబు, రాంమోహన్రెడ్డి, ఇలియాస్, జగదీశ్, మహమ్మద్బాషా, రహంతుల్లా, తదితరులు పాల్గొన్నారు.