Share News

మన గెలుపు ఖాయం!

ABN , Publish Date - Mar 18 , 2024 | 03:27 AM

ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఘన విజయం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

మన గెలుపు ఖాయం!

రాష్ట్రంలో వేవ్‌ ఉంది.. ప్రజాగళం సభ తర్వాత మోదీ వ్యాఖ్య

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లతో మాటామంతీ

అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఘన విజయం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. పల్నాడు జిల్లా బొప్పూడి వద్ద ప్రజాగళం సభ ముగిసిన తర్వాత ఆయన కొద్దిసేపు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. ‘సభ చాలా బాగా జరిగింది. ప్రజల్లో ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో వేవ్‌ ఉంది. మన గెలుపు ఖాయం’ అన్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత వీరిద్దరూ కలుసుకోవడం ఇదే ప్రథమం కావడంతో అప్పటి పరిణామాల గురించి ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీశారు. జైల్లో ఉన్న సమయంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయని, ఇప్పుడు ఏ ఇబ్బందీ లేదని చంద్రబాబు బదులిచ్చారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, వైసీపీ ప్రభుత్వ వ్యవహారాలను ప్రధానికి చంద్రబాబు, పవన్‌ వివరించారు. రాష్ట్రంలో వ్యవస్థలను కుప్పకూల్చిన తీరు, అధికార దుర్వినియోగం, ప్రతిపక్షాలపై తీవ్రమైన అణిచివేత, రాష్ట్రం ఈ ఐదేళ్లలో వెనకబడిపోయిన తీరు, అవినీతి తదితర అంశాలను సోదాహరణంగా ప్రధానికి వివరించారు. వారు చెప్పిన విషయాలను ప్రధాని శ్రద్ధగా విన్నారు.

Updated Date - Mar 18 , 2024 | 03:27 AM