Share News

బస్సులు ఇవ్వొద్దని ఆదేశాలు

ABN , Publish Date - Feb 28 , 2024 | 03:15 AM

తెలుగుదేశం-జనసేన పార్టీలు పశ్చిమ గోదావరి జిల్లా ప్రత్తిపాడులో నిర్వహించనున్న ఉమ్మడి బహిరంగసభపై వైపీపీ ప్రభుత్వం నిఘా పెట్టింది.

బస్సులు ఇవ్వొద్దని ఆదేశాలు

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల నమోదుకు నిర్దేశం

భీమవరం, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం-జనసేన పార్టీలు పశ్చిమ గోదావరి జిల్లా ప్రత్తిపాడులో నిర్వహించనున్న ఉమ్మడి బహిరంగసభపై వైపీపీ ప్రభుత్వం నిఘా పెట్టింది. ఏ జిల్లా నుంచి ఎంతమంది వస్తున్నారో గమనిస్తోంది. నియోజకవర్గాల వారీగా ఆరా తీస్తోంది. సభ ఏర్పాట్లలో తలమునక లైన నాయకుల వివరాలను సేకరిస్తోంది. సభకు జనం తరలిరాకుండా అవరోధాలు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. ఆర్టీసీ బస్సులను ఇవ్వకుండా అడ్డుకుంది. ప్రైవేటు స్కూల్‌ బస్సులు ఇవ్వకుండా హెచ్చరికలు జారీచేసింది. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు అధికంగా నమోదు చేయాలని పోలీసులకు దిశానిర్దేశం చేసింది. సభ విజయవంతం అవకుండా చూసేందుకు అన్ని మార్గాలను అనుసరిస్తోంది.

Updated Date - Feb 28 , 2024 | 08:44 AM