Share News

కడప కోర్టు ఉత్తర్వులపై.. విచారణ నుంచి వైదొలగిన జస్టిస్‌ ఏవీ శేషసాయి ధర్మాసనం

ABN , Publish Date - Apr 25 , 2024 | 03:46 AM

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య విషయంలో వైసీపీ అధ్యక్షుడు/సీఎం జగన్మోహన్‌రెడ్డి, ఆ పార్టీ నేతలపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల విచారణ నుంచి జస్టిస్‌ ఏవీశేషసాయి,

కడప కోర్టు ఉత్తర్వులపై.. విచారణ నుంచి వైదొలగిన జస్టిస్‌ ఏవీ శేషసాయి ధర్మాసనం

వ్యాజ్యాలను మరో బెంచ్‌ ముందుంచేందుకుసీజే ఉత్తర్వులు తీసుకోవాలని రిజిస్ట్రీకి ఆదేశం

అమరావతి, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య విషయంలో వైసీపీ అధ్యక్షుడు/సీఎం జగన్మోహన్‌రెడ్డి, ఆ పార్టీ నేతలపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల విచారణ నుంచి జస్టిస్‌ ఏవీశేషసాయి, జస్టిస్‌ ఎన్‌.విజయ్‌తో కూడిన ధర్మాసనం వైదొలగింది. బుధవారం సదరు పిటిషన్లు విచారణకు రాగా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. వాటిని మరో బెంచ్‌ ముందు ఉంచేందుకు వీలుగా ప్రధాన న్యాయమూర్తి నుంచి ఉత్తర్వులు పొందాలని రిజిస్ట్రీని ఆదేశించింది. వివేకా హత్య విషయంలో వైసీపీ అధ్యక్షుడు, ఆ పార్టీ నేతల పై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న ఏ కేసుల గురించీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడవద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల టీడీపీ అభ్యర్ధి బీటెక్‌ రవి వేర్వేరుగా పిటిషన్లు (సివిల్‌ మిసిలేనియస్‌ అప్లికేషన్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Updated Date - Apr 25 , 2024 | 08:15 AM