కడప కోర్టు ఉత్తర్వులపై.. విచారణ నుంచి వైదొలగిన జస్టిస్ ఏవీ శేషసాయి ధర్మాసనం
ABN , Publish Date - Apr 25 , 2024 | 03:46 AM
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో వైసీపీ అధ్యక్షుడు/సీఎం జగన్మోహన్రెడ్డి, ఆ పార్టీ నేతలపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల విచారణ నుంచి జస్టిస్ ఏవీశేషసాయి,
వ్యాజ్యాలను మరో బెంచ్ ముందుంచేందుకుసీజే ఉత్తర్వులు తీసుకోవాలని రిజిస్ట్రీకి ఆదేశం
అమరావతి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో వైసీపీ అధ్యక్షుడు/సీఎం జగన్మోహన్రెడ్డి, ఆ పార్టీ నేతలపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల విచారణ నుంచి జస్టిస్ ఏవీశేషసాయి, జస్టిస్ ఎన్.విజయ్తో కూడిన ధర్మాసనం వైదొలగింది. బుధవారం సదరు పిటిషన్లు విచారణకు రాగా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. వాటిని మరో బెంచ్ ముందు ఉంచేందుకు వీలుగా ప్రధాన న్యాయమూర్తి నుంచి ఉత్తర్వులు పొందాలని రిజిస్ట్రీని ఆదేశించింది. వివేకా హత్య విషయంలో వైసీపీ అధ్యక్షుడు, ఆ పార్టీ నేతల పై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడవద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల టీడీపీ అభ్యర్ధి బీటెక్ రవి వేర్వేరుగా పిటిషన్లు (సివిల్ మిసిలేనియస్ అప్లికేషన్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.