గూగుల్లో జగన్ కేసులు తప్ప ఏమీ లేవు: జ్యోత్స్న
ABN , Publish Date - Apr 25 , 2024 | 04:13 AM
ఆర్థిక నేరస్తుడైన జగన్రెడ్డి రాష్ట్రాన్ని బాగు చేస్తానంటే ఎవరూ నమ్మరని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న అన్నారు.
అమరావతి, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): ఆర్థిక నేరస్తుడైన జగన్రెడ్డి రాష్ట్రాన్ని బాగు చేస్తానంటే ఎవరూ నమ్మరని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న అన్నారు. ఐదేళ్లలో యువతను గంజాయి, మద్యం, మత్తు పదార్థాలకు బానిసను చేసి, స్వయం ఉపాధిని అటకెక్కించిన జగన్ యువతను ఉద్ధరిస్తానంటే.. ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. జగన్ చెప్పే పిట్టకథలు, కట్టు కథలు వినడానికి జనం పిచ్చోళ్లు కాదన్నారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సోషల్ మీడియా సమావేశంలో ఒక అమ్మాయి తెలుగులో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక జగన్ తెల్లమొఖం వేశాడంటూ ఎద్దేవా చేశారు. సమాధానం చెప్పకుంటే పరువు పోతుందని జగన్ హిస్టరీ గూగుల్లో వెతుక్కోమని భార్గవ్రెడ్డి చెప్పారు. గూగుల్లో జగన్ గురించి వెతికితే.. సీబీఐ, ఈడీ చార్జిషీట్ల లిస్ట్ వచ్చింది. జగన్ పెట్టిన షెల్ కంపెనీల లిస్టు కూడా ఉందని అన్నారు.