ఎంహెచ్పీఎస్ రాష్ట్ర కార్యదర్శిగా నూర్ అహ్మద్
ABN , Publish Date - May 26 , 2024 | 11:52 PM
మైనారిటీ హక్కుల పరిక్షణ సమితి (ఎంహెచ్పీయస్)కు రాష్ట్ర కార్యదర్శిగా స్థానిక సామాజిక కార్యకర్త నూర్ అహ్మద్ను ఎంపిక చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ఫరూక్ షుబ్లీ నియామక పత్రం అందజేశారు.
![ఎంహెచ్పీఎస్ రాష్ట్ర కార్యదర్శిగా నూర్ అహ్మద్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఆదోని టౌన్, మే 26: మైనారిటీ హక్కుల పరిక్షణ సమితి (ఎంహెచ్పీయస్)కు రాష్ట్ర కార్యదర్శిగా స్థానిక సామాజిక కార్యకర్త నూర్ అహ్మద్ను ఎంపిక చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ఫరూక్ షుబ్లీ నియామక పత్రం అందజేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఇంతకాలం తాను చేసిన సేవలను గుర్తించి తన మీద నమ్మకంతో ఈ పదవికి తనను ఎంపిక చేశారని, మైనారిటీల హక్కుల సాధన కోసం కృషి చేస్తానని అన్నారు. అక్షరాస్యత లోపించిన మైనారిటీలలో పేదరికంలో మగ్గిపోతున్న వారి సంఖ్య అధికంగా ఉందన్నారు. వారి సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.