వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక నామినేషన్
ABN , Publish Date - Apr 19 , 2024 | 12:28 AM
వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకా గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
ఎమ్మిగనూరు టౌన్/ రూరల్, ఏప్రిల్18: వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. పట్టణంలోని శిల్పా కాలనీలో ఉన్న కార్యాలయం నుంచి ర్యాలీగా కొత్త మున్సిపాలిటీ వరకు చేరుకొని అక్కడి నుంచి సోమప్ప సర్కిల్ నుంచి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, రుద్రగౌడు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, న్యాయవాదితో కలిసి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్వో చిరంజీవికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కేఆర్. రాఘవరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, బీఆర్ బసిరెడ్డి, భీమిరెడ్డి, నీలకంఠలు పాల్గొన్నారు.
నామినేషన్కు ఎర్రకోట జగన్ డుమ్మా : వైసీపీ అభ్యర్థి బుట్టా నామినేషన్కు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తనయుడు ఎర్రకోట జగన్మోహాన్ రెడ్డి డుమ్మా కొట్టారు. జగన్మోహన్ రెడ్డి రాకపోవటం చర్చనీయాంశంగా మారింది. తనకు సీటు ఇవ్వకుండా మొండి చెయ్యి చూపటంతో ముందునుంచి జగన్మోహాన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే.